కలెక్టరేట్ ఎదుట పంచాయతీ కార్మికుల ధర్నా

కలెక్టరేట్ ఎదుట పంచాయతీ కార్మికుల ధర్నా

ఆసిఫాబాద్ గ్రామపంచాయతీ కార్మికులు ధర్నా దిగారు. పెండింగ్ లో ఉన్న 4 నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని, కనీస వేతనంగా రూ.26 వేలు ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఇవాళ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. తొలుత పట్టణంలోని ఫారెస్ట్ చెక్ పోస్ట్ నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం కలెక్టర్ హేమంత్ సహదేవ్ రావుకు వినతిపత్రం అందజేశారు.