బంజారాల కోసం మోడీ సర్కార్ ఎంతో చేస్తోంది

బంజారాల కోసం మోడీ సర్కార్ ఎంతో చేస్తోంది

హైదరాబాద్:  దేశానికి బంజారా ప్రజలు అందిస్తున్న సేవలు అపూర్వమని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ‘టోరి గోరి’ అనే బంజారా రేడియో యూట్యూబ్ ఛానల్‌ను లాంఛ్ చేసిన దత్తాత్రేయ.. బంజారా భాష, సంస్కృతి ఎంతో ముఖ్యమైందన్నారు. బంజారా బిడ్డలు ఉన్నత చదువులు అభ్యసించి.. ఉన్నతస్థాయి ఉద్యోగాలు చేయాలన్నారు. వాళ్లు గొప్ప మేధావులు అవ్వాలని, రాజకీయ నాయకులవ్వాలని చెప్పారు. నరేంద్ర మోడీ సర్కార్ బంజార జాతి అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తోందన్నారు. ఈ జాతి ప్రజలు అభివృద్ధి దశలో ముందుకు వెళ్లాలని కోరుకున్నారు. 

మరిన్ని వార్తల కోసం: 

అబ్బాయిలకూ లైంగిక వేధింపులు తప్పడం లేదు

రాజకీయాల్లోకి సోనూ సూద్ సోదరి

టిక్కెట్ల రేట్లపై జగన్‌ను కలవనున్న RRR టీమ్