
భారతదేశపు నంబర్ వన్ ద్విచక్ర వాహన తయారీదారి హీరో స్ప్లెండర్ ఎలక్ట్రిక్ అనే కొత్త మోడల్ను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. హీరో కంపెనీ ఈ ఎలక్ట్రిక్ వేరియంట్కు రైడ్ టెస్టింగ్ కూడా చేసింది. ఈ బైకుని త్వరలో మార్కెట్లోకి విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్లో హీరో ఇంజిన్, గేర్బాక్స్ను పవర్ ఫుల్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్తో రీప్లేస్ చేసింది. ఇందులో హీరో స్ప్లెండర్ అద్భుతమైన ఇంకా లేటెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి.
ఈ బైక్ 170 ఎన్ఎమ్ టార్క్ను విడుదల చేస్తుంది. పవర్ ఫుల్ 4 KWH లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్తో 160KM రేంజ్ అందిస్తుంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం .. హీరో ఈ ఎలక్ట్రిక్ ఫ్లాష్ను చాలా కాలంగా అభివృద్ధి చేస్తున్నారు . దీనికి డ్రైవింగ్ టెస్ట్ కూడా జరిగింది. రు ఈ హీరో ఎలక్ట్రిక్ స్ప్లెండర్ కోసం ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన అవసరం లేదు. త్వరలోనే మార్కెట్లోకి రానుంది. దీని ధర గురించి చెప్పాలంటే, దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.70 వేలుగా కంపెనీ నిర్ణయించింది. ఈ బైక్ మిడిల్ క్లాస్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిందని కంపెనీ యాజమాన్య ప్రకటించింది. అయితే దీని అఫీషియల్ లాంచ్ తేదీని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
హీరో స్ప్లెండర్లో అత్యంత ప్రత్యేకత ఏమిటంటే దాని మైలేజీ. బ్యాటరీ 4 నుండి 6 గంటల్లో ఫుల్ ఛార్జింగ్తో 140 కి.మీ నుండి 160 కి.మీ ప్రయాణిస్తుందని పేర్కొన్నారు. దీని ఇంజిన్ అలాగే గేర్బాక్స్ను మోటారు అండ్ బ్యాటరీతో రీప్లేస్ చేస్తుంది. ఇందులో 9 KW మిడ్-షిప్ మౌంటెన్ ఎలక్ట్రిక్ మోటార్ ప్యాక్ ఉంటుంది. దీని టాప్ స్పీడ్ పరిశీలిస్తే గంటకు 90 కి.మీ వెళ్లగలదు ఇంకా దీనిలో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని కూడా చూడవచ్చు.డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ స్పీడ్, బ్యాటరీ లెవెల్, రీడింగ్ మోడ్ , ఉష్ణోగ్రత వంటి సమాచారాన్ని చూపిస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్స్, మెసేజెస్, సైడ్ స్టాండ్ సెన్సార్, LED హెడ్లైట్, LED టెయిల్ లైట్, సేఫ్టీ ఫీచర్స్ , ముందు ఇంకా వెనుక డిస్క్ బ్రేక్స్ వంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి.