బీహార్‌‌లో ఒవైసీ సాయం చేసిండు.. యూపీ, బెంగాల్‌‌లోనూ హెల్ప్ చేస్తాడు

బీహార్‌‌లో ఒవైసీ సాయం చేసిండు.. యూపీ, బెంగాల్‌‌లోనూ హెల్ప్ చేస్తాడు

లక్నో: వెస్ట్ బెంగాల్‌‌తోపాటు ఉత్తర్ ప్రదేశ్‌‌లో జరగనున్న ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ పోటీ చేస్తే తమకు అదనపు ప్రయోజనం చేకూరుతుందని బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ అన్నారు. మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీపై సాక్షి మహారాజ్ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ఆయన పార్టీ పోటీ చేస్తే వారి కంటే తమకే ఎక్కువ ప్రయోజనమని తెలిపారు. ‘ఇది దేవుడి దయ. అసదుద్దీన్ ఒవైసీకి దేవుడు బలం చేకూర్చాలి. బిహార్ ఎన్నికల్లో ఆయన మాకు సాయం చేశారు. ఇప్పుడు ఉత్తర్ ప్రదేశ్‌‌, తదుపరి బెంగాల్‌‌లోనూ హెల్ప్ చేయబోతున్నారు’ అని మహారాజ్ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. బిహార్‌‌ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి గెలిచిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎంఐఎం బీజేపీకి బీ-టీమ్‌‌లా వ్యవహరించిందని కాంగ్రెస్‌‌తోపాటు రాష్ట్రీయ జనతా దళ్ విమర్శించాయి. అలాగే ఒవైసీపై కూడా కాంగ్రెస్ నేతలు కామెంట్లు చేశారు.