దుండిగల్‌ లోని ప్లాస్టిక్‌ షాపులో భారీ అగ్నిప్రమాదం

దుండిగల్‌ లోని ప్లాస్టిక్‌ షాపులో భారీ అగ్నిప్రమాదం

మేడ్చల్‌ జిల్లా దుండిగల్‌లోని గండిమైసమ్మ చౌరస్తా దగ్గర మణికంఠ ప్లాస్టిక్‌ షాపులో ఇవాళ(శుక్రవారం) మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. లాక్‌డౌన్‌ సడలింపుల కారణంగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు షాపు తెరచే ఉంది. మధ్యాహ్నం ఒంటి గంటకు యజమాని దుకాణం మూసివేసి ఇంటికి వెళ్లాడు. కాసేపటి తర్వాత షాపులో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. దుకాణంలోంచి  పొగలు రావడం గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రెండు ఫైర్ ఇంజన్లు ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశాయి. ప్రమాదంలో సుమారు రూ.10లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు షాపు యజమాని చెబుతున్నారు.