భార్య వేధింపులతో భర్త సూసైడ్

భార్య వేధింపులతో భర్త సూసైడ్

మల్యాల, వెలుగు: భార్య వేధింపులతో భర్త సూసైడ్ చేసుకున్నాడు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మల్యాలకు చెందిన అట్టపెల్లి రాజు(30) గొల్లపల్లి మండలం బొంకూరుకి చెందిన రమ్యతో ఏడాది క్రితం వివాహమైంది. పెండ్లికి ముందు రమ్య గ్రామానికి చెందిన రాజేందర్​అనే వ్యక్తిని ప్రేమించింది. పెండ్లయ్యాక కూడా అతనితో చనువుగా ఉండటం గమనించిన భర్త ప్రవర్తన మార్చుకోవాలని సూచించాడు. దీంతో భార్యాభర్తల మధ్య సఖ్యత కొరవడింది. కొన్నాళ్లకు ఆమె పుట్టింటికి వెళ్లి తిరిగి రాలేదు. తీవ్ర మనస్తాపానికి గురైన రాజు మంగళవారం రాత్రి నూకపల్లి సమీపంలోని ఎస్ఆర్ఎస్ పీ వరద కాల్వలో దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఉదయం కాల్వలో రాజు మృతదేహం దొరికింది. మృతుడి తండ్రి నాగయ్య ఫిర్యాదు మేరకు రమ్య, రాజేందర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.