Yuvaraj : భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటె.. వారిద్దరూ టీమ్ లో కీలకం!

Yuvaraj : భారత్ టీ20  వరల్డ్ కప్ గెలవాలంటె.. వారిద్దరూ టీమ్ లో కీలకం!

ఐపీఎల్ తరువాత భారత్ T20 ప్రపంచకప్ ఆడనుంది. అమెరికా, వెస్టిండీస్ లు వేదికగా ఈ పొట్టి ప్రపంచ కప్ కు ప్రాతినిథ్యం ఇవ్వనుంది. మొదటి మ్యాచ్ జూన్ 2న అమెరికా, కెనడా మధ్య జరుగనుంది. ఈ ప్రపంచ కప్ ను కొట్టలాని పెద్ద దేశాల నుండి కొత్తగా క్వాలీఫై అయిన దేశాలు తహతహలాడుతున్నాయి. అయితే దీని కోసం అన్ని దేశాలు తమ టీమ్ లను సెలక్ట్ చేసే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో తమ జట్లను దేశాలు మే 1 తేది లోపు ఐసీసీ కి సమర్పించాల్సి ఉంది. కాగా.. ఏప్రిల్ 28 లేదా 29న ఇండియా జట్టును ప్రకటించే అవకాశం ఉంది. టీమిండియా ఆటగాళ్ళు ఈ టోర్నీకి ఎవరైతే ఆడగలరో అని పలువురు క్రికెటర్లు అంచనా వేస్తున్నారు.

అయితే, తాజాగా 2007 టీ20 వరల్డ్ కప్ హీరో, టీమిండియా ఫ్లేయర్ యువరాజ్ సింగ్ సంచలన కామెంట్స్ చేశారు. ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలవలంటే సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీప్ బుమ్రా తమ నైపుణ్యాలు చూపిస్తే టీమిండియా ఈజీగా గెలవగలదని యువరాజ్ అభిప్రాయపడ్డాడు. వీరిద్దరు టీమ్ కు కీలకం కానున్నారని అన్నారు. అటు సూర్య కుమార్ తన బ్యాట్ కు సమాధానం చెబితే, బూమ్రా బంతితో మాయ చేయగలిగితే ఇండియా కప్ కొట్టగలదని వెల్లడించారు యువీ. కాగా.. తొలి మ్యాచ్ ఇండియా జూన్ 5న న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్ తో ఆడనుంది.