పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఇచ్చిందేంటి.?: పొన్నం ప్రభాకర్

పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి  ఇచ్చిందేంటి.?: పొన్నం ప్రభాకర్

ఆగస్టు నెలలో రైతులకు 2 లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. వచ్చే వర్షాకాలంలో వరికి 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఏమిచ్చిందని ప్రశ్నించారు.  దేవుడి ఫోటో పెట్టుకొని రాముడి పేరుతో ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. కరీంనగర్ కు  బండి సంజయ్, వినోద్ కుమార్ ఐదేళ్ల  చొప్పున ఎంపీగా  చేశారు. వాళ్ల హయాంలో  ఏం చేశారో చర్చకు రావాలని సవాల్ విసిరారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేశానో చెబుతానన్నారు. 

కరీంనగర్ జిల్లా బావుపేటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం, కరీంనగర్ లోక్ సభ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు. బావుపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. తర్వాత జరిగిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు పొన్నం.