కామారెడ్డి, వెలుగు: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో యువకులను మోసగించిన వ్యక్తిని కామారెడ్డి జిల్లా మాచారెడ్డి పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ మీడియాకు వివరించారు. రష్యాలో వర్క్పర్మిట్వీసాలు ఇప్పిస్తామని నమ్మించి కొద్ది రోజుల కింద తనతో పాటు తన ఫ్రెండ్స్ను మోసగించాడని మైసమ్మ చెరువు తండాకు చెందిన భూక్య నరేశ్ పోలీసులకు నిజామాబాద్కు చెందిన గలేటి వెంకటయ్యపై ఫిర్యాదు చేశాడు. వీసా ప్రాసెసింగ్పేరుతో తమ దగ్గర రూ.9.37 లక్షలు వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేరకొన్నాడు.
ఈ నేపథ్యంలో సోమవారం గలేటి వెంకటయ్య అలియాస్ వెంకటేశ్ను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఇతని నుంచి రూ. 45వేల నగదు, బాధితులకు చెందిన 3 పాస్పోర్టులు, మొబైల్ ఫోన్, బైక్ స్వాధీనం చేసుకున్నామన్నారు. రూరల్ సీఐ శ్రీధర్, ఎస్సై అనిల్ ఆధ్వర్యంలో కేసు ఎంక్వైరీ చేసి నిందితుడిని అరెస్టు చేశామన్నారు.
