కృష్ణ జింకను చంపి మాంసం అమ్మిన వేటగాళ్లు అరెస్ట్..

కృష్ణ జింకను చంపి మాంసం అమ్మిన వేటగాళ్లు అరెస్ట్..

కృష్ణ జింకల వేటగాళ్లను అరెస్ట్ చేశారు హైదరబాద్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. కృష్ణ జింకను చంపి మాంసాన్ని అమ్మేసిన వేటగాళ్లు మరో జింకను వేటాడి పట్టుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్ నుంచి జింకను తీసుకెళ్తుండగా.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని మరొకరు పరారీలో ఉన్నారని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ చెప్పారు. వారి నుంచి ఒక ఐ20 కారు,జింక కాళ్లు తలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రధాన నిందితుడు శంకర్ బాబా గతంలో కూడా 10 జింకల్నిచంపేయగా.. కొన్ని జింకల్ని అమ్మాడని చెప్పారు.ఇమ్రాన్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడని త్వరలో పట్టుకుంటామన్నారు.