- సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్
సికింద్రాబాద్, వెలుగు : బీఆర్ఎస్అధిష్ఠానం బీజేపీతో కలిసి పనిచేద్దామని చెప్పడం తనకు నచ్చలేదని, అందుకే ఆ పార్టీకి గుడ్బై చెప్పానని సికింద్రాబాద్కాంగ్రెస్ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ అన్నారు. బుధవారం ఆయన నామినేషన్వేసేందుకు వెళ్లే ముందు సీఎం రేవంత్రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్మోతె శ్రీలతారెడ్డి, ఎంపీ అనిల్కుమార్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్ తో కలిసి సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహాకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాను సెక్యులర్ వాదినని, మతతత్వ పార్టీతో కలిసి పనిచేయడం ఇష్టం లేక, తిరిగి కాంగ్రెస్ లో చేరానని చెప్పారు. తర్వాత ఊరేగింపుగా వెళ్లి నామినేషన్వేశారు.