సూర్యకిరణ్ వజ్రపు విన్యాసం : పైలట్ కు అద్భుత నివాళి

సూర్యకిరణ్ వజ్రపు విన్యాసం : పైలట్ కు అద్భుత నివాళి

బెంగళూరులో జరుగుతున్న ఎయిరో ఇండియా 2019 షోలో భారత ఎయిర్ ఫోర్స్ కళ్లు చెదిరే విన్యాసంతో ఆకట్టుకుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన సూర్య కిరణ్ ఏరోబాటిక్ టీమ్ ఈ ఉదయం తమ సత్తా చాటుకుంది. సూర్యకిరణ్ విమానాలు.. రివ్వుమంటూ ఎగురుకుంటూ వచ్చి… ఆకాశంలోనే విజ్రపు విన్యాసం చేశాయి. మెరుపులు సృష్టించాయి.

ఈ డైమండ్ ఫార్మేషన్ తో ఇటీవల అమరుడైన భారత వైమానిక దళ పైలట్ కు నివాళి అర్పించింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఎయిరో ఇండియా 2019 షోకు ముందు ఫిబ్రవరి 19న జరిగిన రిహార్సల్స్ లో ఓ ప్రమాదం జరిగింది. రెండు సూర్యకిరణ్ జెట్ విమానాలు గాల్లో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ సాహిల్ గాంధీ ప్రాణాలు కోల్పోయారు. ఆయనకు నివాళి అర్పిస్తూ.. ఇవాళ సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ ఈ వజ్రపు విన్యాసం ఆవిష్కరించింది.