
హైదరాబాద్, వెలుగు : లాక్డౌన్ రిలాక్సేషన్స్తో గ్రేటర్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. 100 మందికి టెస్ట్లు చేస్తే 10 మందికి పాజిటివ్ వస్తోంది. నెల కిందట చూస్తే 5.1 శాతంగా ఉన్న పర్సంటేజీ 10కి చేరింది. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్లు, పరిసర ప్రాంతాల ప్రజలకు వైరస్ వ్యాపించి ఉంటుందని, టెస్టుల సంఖ్య పెంచాల్సిన అవసరం బల్దియా అధికారులు భావిస్తున్నారు. పాజిటివ్స్ వచ్చిన ఏరియాల్లో హెల్త్ ఆఫీసర్లు, పోలీసులు ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ను గుర్తిస్తున్నారు. హెల్త్వర్కర్లతో డోర్ టు డోర్ సర్వే చేయిస్తున్నారు. సింప్టమ్స్ఉన్నవారిని గాంధీ, నిమ్స్కు టెస్ట్ల కోసం షిఫ్ట్ చేస్తున్నారు. పాజిటివ్ వస్తే అడ్మిట్, నెగిటివ్ వస్తే హోం క్వారంటెయిన్లో ఉంచుతున్నారు.
టెస్టుల్లో లేని క్లారిటీ
గ్రేటర్లో ప్రైమరీ కాంటాక్స్ అందరికీ టెస్టులు చేయడం లేదు. మస్ట్గా చేస్తామని చెప్పిన సర్కార్ తీరు మళ్లీ మొదటికొచ్చింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తరచూ రూల్స్ మారుస్తుండడంతో క్లారిటీ ఉండడం లేదని బల్దియా అధికారులు వాపోతున్నారు. ఇటీవల కూకట్పల్లిలో పాజిటివ్ పర్సన్ఫ్యామిలీలో ముగ్గురు ప్రైమరీ కాంటాక్ట్లకు టెస్ట్లు చేయగా అందరికీ కరోనా సోకినట్లు తేలింది. మరో పాజిటివ్ వ్యక్తి ఫ్యామిలీలో ముగ్గురు ప్రైమరీ కాంటాక్ట్లకు టెస్ట్లు చేస్తే నెగిటివ్ వచ్చింది. వైరస్ బారిన పడ్డ 80 శాతం మందిలో సింప్టమ్స్ కనిపించడం లేదు. టెస్ట్ల సంఖ్య పెంచడంతోనే కరోనా కట్టడి సాధ్యమని బల్దియా అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వం తరచూ రూల్స్ మారుస్తుండడంపై అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. సిటీలో వైరస్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అయ్యిందా అనే అనుమానాలూ మొదలయ్యాయి. ఈ కోణంలోనే ఎత్తేసిన 5 కంటెయిన్మెంట్ ఏరియాల్లో ఇటీవల ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ టీమ్లు రెండ్రోజుల పాటు టెస్టులు చేశాయి.
జాగ్రత్తగా ఉంటేనే కంట్రోల్లోకి..
అలర్ట్గా ఉండి, అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే కరోనా కట్టడి సాధ్యం. నిత్యావసరాల కోసం ఇంట్లో ఒకరు మాత్రమే వెళ్లాలి. పిల్లలు, వృద్ధులను బయటకు పంపొద్దు. మాస్క్, ఫిజికల్ డిస్టెన్స్ మస్ట్. రద్దీ ఏరియాలకు అసలే వెళ్లొద్దు. ఫంక్షన్లు, పార్టీలకు దూరంగా ఉండాలి. ఇంటిని, పరిసరాలను క్లీన్గా ఉంచుకోవాలి.
‑ డీఎస్ లోకేశ్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్