వందే భారత్​ మిషన్ ఫేజ్‌‌‌‌-2 : 7 రోజులు.. 31 దేశాలు.. 149 ఫ్లైట్లు

వందే భారత్​ మిషన్ ఫేజ్‌‌‌‌-2 : 7 రోజులు.. 31 దేశాలు.. 149 ఫ్లైట్లు

న్యూఢిల్లీ: విదేశాల్లో చిక్కుకున్న మనవాళ్లను తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రారంభించిన వందేభారత్​ మిషన్‌ సెకండ్​ ఫేజ్‌‌ మే 16నుంచి 22వరకు జరుగుతుంది. 31 దేశాలలోని ఇండియన్స్‌‌ను 149 ఫ్లైట్లలో తీసుకొచ్చేందుకు ప్లాన్​చేస్తున్నామని ఎయిర్​ఇండియా అధికారులు తెలిపారు. 12 దేశాల నుంచి 64 ఫ్లైట్స్‌‌లో సుమారు 15,000 మందిని మనదేశానికి మొదటి ఫేజ్‌‌లో తీసుకొస్తున్నారు. మే 7న ప్రారంభమైన ఫస్ట్​ఫేజ్​14వ తేదీతో ముగుస్తుంది. ‘సెకండ్​ఫేజ్‌‌లో ఎయిర్​ఇండియా, ఎయిర్​ఇండియా ఎక్స్‌‌ప్రెస్​149 ఫ్లైట్లను ఆపరేట్​చేస్తాయి. యూఎస్ఏ, యూఏఈ, కెనడా, సౌదీ అరేబియా, యూకే, మలేషియా, ఒమన్, కజక్‌‌స్థాన్, ఆస్ట్రేలియా, ఉక్రెయిన్, ఖతార్, ఇండోనేషియా, రష్యా, ఫిలిప్పైన్స్, ఫ్రాన్స్, సింగపూర్, ఐర్లాండ్, కిర్గిస్థాన్, కువైత్, జపాన్, జార్జియా, జర్మనీ, తజికిస్థాన్, బహ్రెయిన్, అర్మేనియా, థాయ్‌‌లాండ్, ఇటలీ, నేపాల్, బెలారస్, నైజీరియా, బంగ్లాదేశ్ ​దేశాలలో చిక్కుకున్న మనవాళ్లను తీసుకొస్తాం’ అని అధికారులు చెప్పారు.

67శాతం మందికి జాబ్ లాస్