ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో ఎలాంటి కాంబినేషన్తో బరిలో దిగాలన్నదానిపై ఇండియా కసరత్తులు ముమ్మరం చేసింది. బ్యాటింగ్ లైనప్పై ముందునుంచే స్పష్టత ఉన్నా.. కీలకమైన బౌలింగ్పై కూడా ఓ అంచనాకు వచ్చేసింది! నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్ కాంబినేషన్ను ప్రస్తుతానికి పక్కనబెట్టిన కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి.. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల స్ట్రాటజీకి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది..! ఇంగ్లిష్ కండీషన్స్, పిచ్తోపాటు ప్రత్యర్థి న్యూజిలాండ్ లైనప్ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం..! అయితే ఫ్రంట్ లైన్ స్పిన్నర్ల ఎంపికలో ఎలాంటి ఇబ్బందుల్లేకపోయినా.. థర్డ్ పేసర్ ఎవరనే దానిపైనే ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్నది..!
సౌతాంప్టన్: అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు టీమిండియా తుది జట్టును ఖరారు చేసుకునే పనిలో పడింది. ప్రాక్టీస్ మ్యాచ్ లేకపోయినా, ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ పెర్ఫామెన్స్తోనే ఫైనల్ ఎలెవన్ను రూపొందించుకుంటోంది. దీనికితోడు ఇంగ్లిష్ కండీషన్స్, పిచ్ను బట్టి బౌలింగ్ లైనప్పై ఓ అంచనాకు వచ్చింది. ఇండియారే బాగా కలిసొచ్చే ఐదుగురు బౌలర్ల వ్యూహ్యంతోనే బరిలోకి దిగాలని కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవి శాస్త్రి భావిస్తున్నారు. ఇందులో భాగంగా ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల లైనప్తో న్యూజిలాండ్ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడున్న అంచనాల ప్రకారం దాదాపుగా ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నా.. లాస్ట్ మినిట్లో ఏదైనా మార్పులు కూడా చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదు. పిచ్ కూడా పేస్–స్పిన్కు అనుకూలంగా ఉన్నట్లు ఏజెస్ బౌల్ క్యూరేటర్ సైమన్ లీ వెల్లడించాడు. ‘ఫస్ట్ త్రీ డేస్ పేస్, బౌన్స్, క్యారీ ఉంటుంది. లాస్ట్ రెండు రోజులు స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది’ అని లీ పేర్కొన్నాడు.
3+2 కాంబినేషన్..
సౌతాంప్టన్లో ఇండియా చివరిగా ఆడిన టెస్టును దృష్టిలో ఉంచుకొని రెండో స్పిన్నర్తో బరిలోకి దిగడం చెత్త ఐడియా మాత్రం కాదు. 2018 టూర్లో ఇక్కడ జరిగి పోరులో ఇంగ్లండ్ ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. ఫైనల్ ఎలెవన్లో మొయిన్ అలీ, ఆదిల్ రషీద్ను ఆడించారు. ఈ మ్యాచ్లో అలీ 9 వికెట్లు తీస్తే, అశ్విన్ మూడుకే పరిమితమయ్యాడు. లాస్ట్ రెండు రోజులు పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది కాబట్టి ఇద్దరు స్పిన్నర్లు ఉండటం మేలే. కాబట్టి జడేజా, అశ్విన్ను తీసుకున్నా.. బ్యాటింగ్ బలం కూడా బాగా పెరుగుతుంది.
థర్డ్ పేసర్ ఎవరు?
ఇంగ్లిష్ కండీషన్స్ బట్టి చూస్తే పేసర్లు బుమ్రా, షమీ ఆటోమెటిక్ చాయిస్. ఈ ఇద్దరి వేరియేషన్స్ కూడా అద్భుతంగా పని చేస్తాయి. చాలా రోజుల నుంచి ఇండియా బౌలింగ్ కాంబినేషన్లో కీలకంగా ఉన్నారు. అయితే ఇప్పుడు థర్డ్ పేసర్ ఎవరన్నదే అతిపెద్ద ప్రశ్నగా కనిపిస్తోంది. ఇషాంత్ శర్మ, శార్దూల్ ఠాకూర్తో పాటు హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ కూడా ఈ ప్లేస్ కోసం పోటీపడుతున్నాడు. తన హైట్తో విపరీతమైన బౌన్స్ను క్రియేట్ చేస్తాడు కాబట్టి ఆస్ట్రేలియాలో అయితే ఇషాంత్ను ఆడించాల్సిందే. కానీ ఇంగ్లండ్కు వచ్చేసరికి పరిస్థితులు కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి వేరియేషన్ కోసం సిరాజ్ను తీసుకోవాలని విరాట్ భావిస్తున్నాడు. కొన్ని నెలలుగా సిరాజ్ వండర్స్ క్రియేట్ చేస్తున్నాడు. ఇండియా పిచ్లపైనే ఇంగ్లిష్ బ్యాట్స్మెన్ను వణికించాడు. ఆసీస్లో మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్ చేశాడు. కాబట్టి ఇక్కడ కూడా సిరాజ్ ప్రభావం చూపిస్తాడని కెప్టెన్ నమ్ముతున్నాడు. ఇక శార్దూల్ విషయానికొస్తే స్వింగ్ రాబడతాడు.నైట్ వాచ్మన్గా కూడా ఉపయోగపడతాడు. అయితే ఇంగ్లండ్లో ఎక్స్పీరియెన్స్ను పరిగణనలోకి తీసుకుంటే ఇషాంత్కే చాన్స్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే 2018 టూర్లో 18 వికెట్లతో టాప్ బౌలర్గా నిలిచాడు. అదనపు పేస్, బౌన్స్ కూడా ఆయుధంగా ఉపయోగపడొచ్చు.
4+1 కాంబినేషన్ అయితే ఎలా?
ఒకవేళ కోహ్లీ అండ్ శాస్త్రి.. చివరి నిమిషాల్లో 3+2 కాంబినేషన్ మార్చి 4+1కు వెళ్తే.. ఒక్క స్పిన్నర్ ఎవరుంటారు. మ్యాచ్ టైమ్లో చిరుజల్లులు పడే చాన్స్ ఉందని వాతావరణ నివేదిక. దీనిని దృష్టిలో పెట్టుకుంటే కోచ్ అండ్ కెప్టెన్ నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్తో దిగొచ్చు. లాస్ట్ రెండు రోజులు స్పిన్కు అనుకూలం కాబట్టి ఏకైక స్పిన్నర్గా అశ్విన్తో నడిపించొచ్చని ఈ ఇద్దరు అనుకుంటున్నారు. అప్పుడు జడేజా బెంచ్కు పరిమితమవుతాడు. ఇక పేసర్లలో బుమ్రా, షమీ, సిరాజ్, ఇషాంత్ ఫైనల్ ఎలెవన్లోకి వస్తారు. ఓవరాల్గా మ్యాచ్కు ముందు రోజు ఉండే వెదర్ కండీషన్స్పైనే ఫైనల్ ఎలెవన్ ఆధారపడి ఉంటుంది.