భారత్‌లో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

భారత్‌లో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

భారత్‌లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. నిన్నటితో పోల్చితే కేసుల సంఖ్య కాస్త పెరిగింది. నిన్న 17వందలు దాటి కేసులు నమోదు అయ్యింది. తాజాగా 19వందలకు పైగా పాజిటివ్ కేసులు రికార్డ్ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 1,938 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా బారిన పడి తాజాగా 67  మంది చనిపోయారు.దీంతో కరోనా మృతుల సంఖ్య 5,16,67కు చేరింది. ఇక 2,531 కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య  4,24,75,588కు చేరింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 22427 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక డైలీ పాజిటివిటీ రేటు 0.29% శాతంగా ఉంది.