చెస్టర్ లి స్ట్రీట్: ఇంగ్లండ్ టూర్ను ఇండియా విమెన్స్ ఘోర ఓటమితో ప్రారంభించింది. మూడు టీ20ల సిరీస్లో భాగంగా శనివారం అర్ధరాత్రి జరిగిన తొలి మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్లో పూర్తిగా నిరాశపరిచింది. దాంతో, ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు వచ్చిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 132/7 స్కోరు మాత్రమే చేయగలిగింది. దీప్తి శర్మ (29 నాటౌట్) టాప్ స్కోరర్. మంధాన (23), హర్మన్ (20) ఫర్వాలేదనిపించారు. హోమ్ టీమ్ బౌలర్లలో సారా గ్లెన్ (4/23) సత్తా చాటింది.
అనంతరం ఓపెనర్ సోఫియా డంక్లే (44 బాల్స్లో 8 ఫోర్లు, 1 సిక్స్తో 61 నాటౌట్) చెలరేగడంతో ఇంగ్లండ్ 13 ఓవర్లలోనే 134/1 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. డానీ వ్యాట్(24), కాప్సే (32 నాటౌట్) రాణించారు. సారా గ్లెన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మంగళవారం రాత్రి జరుగుతుంది.