ప్రతిష్టాత్మక ఎసియన్ బాడీ బిల్డింగ్ పోటీలలో భారత్ కు చెందిన ఆర్మీ మేజర్ సిల్వర్ మెడల్ సాధించాడు. 53వ ఎసియన్ బాడీ బిల్డింగ్ మరియు ఫిజిక్ ప్సోర్ట్స్ చాంపియన్ షిప్ పోటీలు అక్టోబర్ 2న ఇండోనేషియాలో జరిగాయి. భారత్ తరపున మేజర్ మజ్ అబ్దుల్ ఖదీర్ ఖాన్ పాల్గొన్నారు. రెజిమెంట్ డ్యూటీలో బిజీ షెడ్యూల్ లో కూడా ఖదీర్… బాడీ బిల్డింగ్ కసరత్తులు చేశారు. 2014నుంచి బాడీ బిల్డింగ్ పోటీలకు ట్రేన్ అవుతున్నారు.
జబాల్ పుర్ ట్రేనింగ్ సెంటర్ లో బాడీ బిల్డింగ్ లో శిక్షణ తీసుకుని… జులై 2019 ఖమ్మంలో జరిగిన.. ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ సెలక్షన్ లో పాల్గొని భారత్ తరపున ప్రాతినిద్యం వహించడానికి ఎన్నికయ్యాడు. ఖదీర్ సాదించిన విజయం భారత ఆర్మీ కీర్తిని పెంచిందని అన్నారు ఆర్మీ అధికారులు.
Indian Army's Major Abdul Quadir Khan won a Silver Medal at 53rd Asian Body Building and Physique Sports Championship held at Batam in Indonesia on 2 Oct. pic.twitter.com/XcrgisDTqo
— ANI (@ANI) October 4, 2019