ఇల్లు కొనే వారికి ఊరట

ఇల్లు కొనే వారికి ఊరట

సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలనుకునే వారికి నిర్మలా సీతారామన్ ఊరట ఇచ్చారు. పార్లమెంట్‌లో 2019-20 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆమె.. మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసేవారికి ప్రోత్సాహకాలు కల్పించారు. రూ.45 లక్షల లోపు గృహ రుణాలపై వడ్డీ రాయితీని పెంచారు. ప్రస్తుతం గృహ రుణాలపై రూ. 2 లక్షల వరకు వడ్డీ రాయితీ ఉండగా.. దాన్ని రూ. 3.50 లక్షల వరకు పెంచుతున్నట్లు సీతారామన్‌ తెలిపారు.