వరంగల్ లో జవాన్ దారుణ హత్య

వరంగల్ లో జవాన్ దారుణ హత్య

వరంగల్ జిల్లాలో ఆర్మీ జవాన్ దారుణ హత్యకు గురైయ్యాడు. నర్సంపేట పట్టణం కుమ్మరికుంటకు చెందిన ప్రేమ్ కుమార్ స్నేహితులతో ఉన్న సమయంలో దుండగులు కత్తితో పొడిచి పరారయ్యారు. దీంతో అతడిని ఎంజీఎంలో ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి సీరియస్ గా ఉండడంతో అక్కడి నుంచి హైదరాబాద్ కు తరలిస్తుండగా ప్రేమ్ మృతి చెందాడు. ప్రేమ్ కుమార్ 3 రోజుల క్రితం సెలవులపై ఇoటికి వచ్చినట్లు తెలుస్తోంది.