జయం రవి హీరోగా ఆంథోని భాగ్యరాజ్ తెరకెక్కించిన తమిళ చిత్రం ‘సైరన్’. కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్గా నటించారు. ‘గంగ ఎంటర్టైన్మెంట్స్’ అధినేత మహేశ్వర్ రెడ్డి మూలి ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. ఆడియన్స్ నుంచి మిక్సెడ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది.
రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 11న డిస్నీ ప్లస్ హాట్స్టార్ లోకి రాబోతున్నట్లు సమాచారం.త్వరలో మేకర్స్ ఆఫీసియల్ గా అనౌన్స్ చేసే అవకాశం ఉంది.ఈ సినిమాలో జయం రవి మునుపెన్నడు లేని విధంగా కనిపించి మెప్పించాడు. అంతేకాకుండా ఈ సినిమాలో సౌత్ కి చెందిన యాక్టర్స్ కూడా నటించడంతో ఓటీటీ ఫ్యాన్స్ సైరన్ మోత కోసం వెయిట్ చేస్తున్నారు.
సైరన్ కథ:
సింపుల్ గా చెప్పాలంటే పెరోల్ పై విడుదలైన ఖైదీ రివెంజ్ డ్రామా ఫిల్మ్ ఇది. తన భార్య మరణానికి కారణమైన పోలీస్ ఆఫీసర్తో పాటు పొలిటికల్ లీడర్స్పై ఓ సాధారణ అంబులెన్స్ డ్రైవర్ ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు. అలాంటి క్రమంలో అతనికి ఎదురైనా సవాళ్లేంటీ?అనేది ఇంట్రెస్టింగ్ చూపించారు. ఇందులో తండ్రీకూతుళ్ల ఎమోషన్ తో పాటు పోలీస్, కిల్లర్ ఒకరిపై మరొకరు వేసే ఎత్తులు..పై ఎత్తులతో రివెంజ్ డ్రామాను అల్లుకుంటూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కించారు డైరెక్టర్.