కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్: ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హతం

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్: ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హతం

కశ్మీర్‌లో జ‌రిగిన‌ ఎన్‌కౌంట‌ర్‌లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ సహా ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీన‌గ‌ర్ శివారులోని ర‌ణ్‌బీర్‌గ‌ఢ్ ప్రాంతంలో టెర్రరిస్టులు దాగి ఉన్నార‌న్న ప‌క్కా స‌మాచారంతో శ‌నివారం ఉద‌యం జ‌మ్ము క‌శ్మీర్ పోలీసులు, ఆర్మీ జ‌వాన్లు సంయుక్తంగా కార్డ‌న్ సెర్చ్ ఆప‌రేష‌న్ మొద‌లుపెట్టారు. ఈ స‌మ‌యంలో ఒక్క‌సారిగా ఇరు వ‌ర్గాల మ‌ధ్య కాల్పులు జ‌రిగాయి. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో ఇద్ద‌రు ల‌ష్క‌రే తొయిబా టెర్ర‌రిస్టులను మ‌ట్టుబెట్టారు భార‌త ఆర్మీ జ‌వాన్లు. ప‌ర‌స్ప‌రం హోరాహోరీగా జ‌రిగిన కాల్పుల్లో ఒక జ‌వాను తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్లు సీనియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ ఒక‌రు తెలిపారు. ఆ సైనికుడిని శ్రీ‌న‌గ‌ర్‌లోని ఆర్మీ బేస్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్న‌ట్లు చెప్పారు. ఎన్‌కౌంట‌ర్‌లో హ‌త‌మైన ఉగ్ర‌వాదుల‌ను ఇష్‌ఫ‌ఖ్ ర‌షీద్, అయిజాజ్ భ‌ట్‌గా గుర్తించామ‌న్నారు. శ్రీన‌గ‌ర్ స‌మీపంలోని సోజీత్ గ్రామానికి చెందిన ర‌షీద్ 2018 నుంచి ల‌ష్క‌రే తోయిబా టాప్ క‌మాండ‌ర్‌గా ఉన్నాడ‌ని, అనేక కేసుల్లో మోస్ట్ వాంటెడ్ ప‌ర్స‌న్ అని చెప్పారు. మ‌రో టెర్ర‌రిస్ట్ అయ‌యిజాజ్ భ‌ట్ పుల్వామా ప్రాంతానికి చెందిన‌వాడ‌ని, అత‌డు చాలా కాలం నుంచి ల‌ష్క‌రే తొయిబాలో కీల‌కంగా ప‌ని చేస్తున్నాడ‌ని తెలిపారు.