చాదర్ఘాట్లో రూ.4 లక్షల విలువైన హాష్ ఆయిల్ పట్టివేత

చాదర్ఘాట్లో రూ.4 లక్షల విలువైన హాష్ ఆయిల్ పట్టివేత

హైదరాబాద్లోని చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గాంజా విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారంతో పోలీసులు సోదాలు చేశారు. ఈ నేపథ్యంలోనే ముగ్గురు డ్రగ్ పెడ్లర్స్ ను ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్, చాదర్ ఘాట్ పోలీసులు కలిసి పట్టుకున్నారు. అంతే కాకుండా వీరి వద్ద నుంచి రూ.4 లక్షల  విలువైన హాష్ ఆయిల్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో జగద్గిరిగుట్టకు చెందిన సందీప్ గౌడ్, వినయ్ కుమార్ రెడ్డి, మల్కాజ్గిరికి చెందిన పృధ్వీరాజ్లను మలక్ పేట్ యశోద హాస్పిటల్ వద్ద అరెస్ట్ చేశారు. విశాఖపట్నం అరకుకు చెందిన కృష్ణ అనే వ్యక్తి వీరికి ఈ హాష్ ఆయిల్ సప్లై చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కృష్ణ ప్రస్తుతం పరారీలో ఉండటంతో అతని కోసం గాలిస్తున్నారు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి, సులువుగా డబ్బులు సంపాదించుకునేందుకు యువత తప్పడు మార్గాలు ఎంచుకుంటోందని పోలీసులు అంటున్నారు. ఇందుకోసం గాంజా, హాష్ ఆయిల్ విక్రయిస్తున్నారని చెప్పారు.