ఇందిరాపార్క్ కు చేరుకున్న కోదండరాం

ఇందిరాపార్క్ కు చేరుకున్న కోదండరాం

చలో సెక్రటేరియట్ నిరసన కార్యక్రమంలో భాగంగా ఇందిరాపార్క్ దగ్గర నిరసన తెలిపేందుకు నాయకులు వస్తున్నారు. తెలంగాణ జనసమితి పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ ఇందిరాపార్క్ కు చేరుకున్నారు.

దీక్షా స్థలం వద్ద పోలీసుల అనుమతితో కొన్ని కుర్చీలు ఏర్పాటుచేశారు. నాయకులు, నిరసనకారులు ఇప్పుడిప్పుడే దీక్షా స్థలానికి చేరుకుంటున్నారు.

చలో సెక్రటేరియట్ నిరసన ర్యాలీకి పర్మిషన్ లేదని చెబుతున్న పోలీసులు… ఎవరైనా ఆజ్ఞలు పాటించకపోతే.. వారిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. బొలారం లేదా గోషామహల్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తారని సమాచారం.

ఇందిరాపార్క్ లో నిరసన తర్వాత ఎన్టీఆర్ గ్రౌండ్ కు నిరసన కారులు వెళ్తారనే ఉద్దేశంతో NTR గ్రౌండ్ గేట్ కు తాళం వేశారు పోలీసులు.