ప్రియాంక హత్యకేసు: వాడి బైకూ డేంజరే

ప్రియాంక హత్యకేసు: వాడి బైకూ డేంజరే
  • పెద్దగా సౌండ్ చేస్తూ రయ్ మని దూసుకెళ్లేవాడు
  • ప్రియాంక రెడ్డి హత్య కేసు నిందితుడు నవీన్ మనస్తత్వంపై స్థానికులు

హైదరాబాద్, వెలుగు: వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యకేసులో నిందితుడు నవీన్ ​మనస్తత్వం అందరికంటే భిన్పంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో నిందితులందరూ 18 నుంచి 22 ఏళ్ల వయసువారే. వీరిలో నవీన్ కుమార్ యాటిట్యూడ్ డిఫరెంట్ గా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అతడి బైక్ చూస్తేనే డేంజర్ గా ఉందని అంటున్నారు. నవీన్ తన మామూలు బైక్ ను స్పోర్ట్స్ బైకుగా మార్చుకున్నాడు. బైక్ కు ఉన్న హెడ్ లైట్ తొలగించి ఆ ప్లేస్ లో ఓ బోర్డ్ పెట్టి.. దానిపై డేంజర్ బొమ్మ పెట్టుకున్నాడు. దానికి రెండు వైపులా ఎల్ ఈడీ బల్బులను అమర్చుకున్నాడు. బండిపై వివిధ కాప్షన్లతో టైగర్ బొమ్మలను వేయించుకున్నాడు. బైక్ సౌండ్ పెద్దగా వచ్చేలా సైలెన్సర్  సెట్ చేసుకున్నాడు. గ్రామంలో రయ్ రయ్ మని పెద్దగా సౌండ్ చేసుకుంటూ బైక్ పై వెళ్లేవాడని స్థానికులు చెప్పారు. నవీన్ తోపాటు మరో ఇద్దరు నిందితులు ఒకే బైక్​పై తిరిగేవారని గ్రామస్తులు అంటున్నారు. బైక్​కు రిజిస్ట్రేషన్ ​నంబర్ కూడా లేకపోవడంతో దొంగిలించుకువచ్చాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతని ఇంటికి తాళం వేసి ఉండడంతో కుటుంబ సభ్యుల గురించి ఎలాంటి సమాచారం లేదు.