రైతు బంధు ఎంత తీసుకుంటున్నారో మల్లారెడ్డి చెప్పాలి

రైతు బంధు ఎంత తీసుకుంటున్నారో మల్లారెడ్డి చెప్పాలి

దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా దీక్ష ఉంటే మంత్రి మల్లారెడ్డి ఫ్లెక్సీలు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్. ఆ ఫ్లెక్సీలల్లో దళితులకు, గిరిజనులకు ఏమి లబ్ది చేకూర్చారో తెలపలేదన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. మల్లారెడ్డి 600 ఎకరాలు భూమి ఉందని ఆయనే చెప్పారు.... అందులో అసైన్డ్, దళిత, గిరిజనుల భూములు ఎన్ని ఉన్నాయో చెప్పాలన్నారు. ఈ భూమికి రైతు బంధు ఎంత తీసుకుంటున్నావో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. మాల్లారెడ్డి 600 ఎకరాలు భూమికి సంబంధించిన వివరాలు తెలపాలన్నారు.
 
తిడితే తిట్టారంటారు..ఆయన చేసే పనులు మాత్రం మంచివి కావన్నారు బలరాం నాయక్. ఏ పేపర్లు పెట్టి మెడికల్ కాలేజీ తెచ్చుకున్నావో మాకు తెలుసన్నారు. దళిత, గిరిజన దీక్షను మంత్రి మల్లారెడ్డి వ్యతిరేకిస్తున్నారు..దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత మంత్రి మల్లారెడ్డికి లేదు..ఆ స్థాయి కూడా లేదన్నారు.