ఈ నెల 25న తెలంగాణ బంద్ కు మావోల పిలుపు 

ఈ నెల 25న తెలంగాణ బంద్ కు మావోల పిలుపు 

సీపీఐ(మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఈ నెల 25న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. కవి వరవరరావుతో పాటు ఇతరులను వెంటనే జైలు నుండి విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేసింది. అదే విధంగా అటవీ ప్రాంతాల నుంచి గ్రే హౌండ్స్ సిబ్బంది వెనక్కి వెళ్లాల్సిందిగా చెప్పింది. మావోయిస్టు పార్టీ తెలంగాణ స్టేట్ కమిటీ అధికార ప్రతినిధి జగన్ దీనికి సంబందించి లేఖను విడుదల చేశారు.

భీమా కోరెగావ్ సంఘటనలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వరవరరావు, ఇతరులను విడుదల చేయాలని… వరవరరావుపై ఉన్న కేసులను వెంటనే ఎత్తివేయాలంది. 60 ఏళ్లు పైబడిన ఖైదీలను విడుదల చేయాలని ప్రజలు డిమాండ్ చేయాల్సిందిగా లేఖ ద్వారా తెలిపారు.