మావోయిస్టు పోస్టర్ల కలకలం..అధికార పార్టీ నేతలకు హెచ్చరిక

మావోయిస్టు పోస్టర్ల కలకలం..అధికార పార్టీ నేతలకు హెచ్చరిక

ములుగు జిల్లా ఏటూరునాగారంలో మావోయిస్టు పార్టీ వాల్ పోస్టర్ల కలకలం రేపాయి. పలువురు అధికార పార్టీ నేతలకు హెచ్చరికలు చేస్తూ వాల్ పోస్టర్లు దర్శనమిచ్చాయి. అధికార పార్టీని అడ్డం పెట్టుకొని భూ కబ్జాలు, ఇసుక దోపిడీకి పాల్పడుతున్న నాయకులకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరికలు చేసింది మావోయిస్టు పార్టీ. వాల్ పోస్టర్లలో పలువురి పేర్లు ప్రకటించింది మావోయిస్టు పార్టీ. సమాచారం అందుకున్న పోలీసులు పోస్టర్ లను పరిశీలించారు. పోలీసుల ఆదేశాలతో స్థానికులు  పోస్టర్లను చించేశారు.