కరోనా విషయంలో ఆందోళన వద్దు

కరోనా విషయంలో ఆందోళన వద్దు

తెలంగాణలో కరోనా కలకలం కొనసాగుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీంతో అధికార యంత్రంగాం అప్రత్తం అయ్యింది. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ...   ప్రభుత్వం కరోనాని ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉందన్నారు. రెండు కోట్ల టెస్టుల కిట్లు, ఒక కోటి హోం ఐసోలేషన్ కిట్లు సిద్ధంగా ఉంచామన్నారు. ప్రజలు కూడా సహకరించాలన్నారు. ఆసుపత్రిలో కరోన చికిత్సలు చేయించుకోవాలన్నారు. కరోన వచ్చిన ప్రతి ఒక్కరికి హోం ఐసోలేషన్ కిట్లను అందజేస్తున్నామన్నారు.  ఐసోలేషన్ కోసం సిద్దిపేటలో ఆక్సిజన్ సౌకర్యంతో వంద పడకల ఆసుపత్రి ఉందన్నారు. సీఎం ఆదేశాలతో వైద్య ఆరోగ్య శాఖ సంసిద్దంగా ఉందన్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు హరీశ్ రావు.