తన వెంట ఎవరూ లేరని ఫ్రస్టేషన్‌లో ఉన్నడు

తన వెంట ఎవరూ లేరని ఫ్రస్టేషన్‌లో ఉన్నడు

ఈటల వెంట ఎవరూ లేరని.. అందుకే ఆయన ఫ్రస్టేషన్ లో ఉన్నారన్నారు మంత్రి హరీష్ రావు. ఓటమి భయంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. జమ్మికుంట పట్టణంలోని ఎంపి ఆర్ గార్డెన్ లో  మంత్రి హరీష్ రావు సమక్షంలో పలువురు టీఆర్ఎస్ లో చేరారు.  ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ 2003లో ఈటెల  టీఆర్ఎస్ లో చేరక ముందే ఈ ప్రాంతం గులాబీ మయం అయింది.  తెలంగాణలో బీజేపీ ఎక్క..డుందో చెప్పాలన్నారు. గెల్లు శ్రీనివాస్ గెలిస్తే KCR కాల్లు మొక్కి మెడికల్ కాలేజ్ తెస్తారని.. ఈటెల గెలిస్తే అభివృద్ది అయితదా అని ప్రశ్నించారు హరీష్. బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలో చెప్పాలన్నారు. ప్రభుత్వ ఆస్తులు అమ్మడంలో బిజెపి అభివృద్ది చెందిందన్నారు హరీశ్.