పరీక్షల టైమ్ లో  విద్యార్థులను ఇబ్బందులు పెట్టొద్దు

పరీక్షల టైమ్ లో  విద్యార్థులను ఇబ్బందులు పెట్టొద్దు
  • ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల పై ఆగ్రహం వ్యక్తం 

ఈ నెల25నుంచి జరగబోయే ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పరీక్ష్మల నిర్వహణపై  నాంపల్లిలోని ఆఫీసులో అన్ని శాఖలతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు 25 నుంచి ప్రారంభం అవుతున్నాయని.. గతంలో కరోనా కారణం గా ప్రమోట్ చేసిన విద్యార్థులకు ఇప్పుడు పరీక్షలు పెడుతున్నామని తెలిపారు. నాలుగు లక్షల యాభై వేలకు పైగా విద్యార్థులు పరీక్ష రాయనున్నారని చెప్పారు. జిల్లా స్థాయిలో అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటున్నామని.. కరోనా కారణంగా పరీక్షా కేంద్రాలను 1750కి పెంచడం జరిగిందన్నారు. 25వేల మంది ఇన్విజిలేటర్ లు పాల్గొంటున్నారని..పరీక్ష కేంద్రంలో ఐసోలేషన్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.

 విద్యార్థులు గంట ముందు వచ్చినా పరీక్షా కేంద్రం లోకి అనుమతించాలన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ప్రైవేట్ యాజమాన్యాలు  పరీక్ష నిర్వహణకు సహకరించాలని..పరీక్షల టైమ్ లో విద్యార్ధులను ఇబ్బందులు పెట్టొద్దని సూచించారు.