విద్యాసంస్థల ప్రారంభానికి ఇదే సరైన సమయం

విద్యాసంస్థల ప్రారంభానికి ఇదే సరైన సమయం

రాష్ట్రంలో సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. విద్యాసంస్థల ప్రారంభానికి ఇదే సరైన సమయమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని అన్ని విధాలుగా ఆలోచించి పాఠశాలల పునః ప్రారంభంపై సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారని తలిపారు. శనివారం ఆమె బషీర్‌బాగ్‌లోని గన్‌ ఫౌండ్రీ డివిజన్‌లోని మహబూబియా బాలికల పాఠశాలను ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఒమర్‌ జలీల్‌, పాఠశాల విద్యా కమిషనర్‌ దేవసేనతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాట్లను పరిశీలించి, విద్యార్థుల..ఉపాధ్యాయుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ నెల 26 నుంచే ఉపాధ్యాయులు స్కూళ్లకు రావాలని ఆదేశించినట్లు సబిత చెప్పారు. ఒకటో తేదీ వరకు పాఠశాలల్లో అన్ని రకాల సదుపాయాలు పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లను వేగంగా రెడీ చేస్తున్నట్లు చెప్పారు. అన్ని చోట్లా ప్రజాప్రతినిధులు చొరవ చూపుతున్నారని.. ఇదే స్ఫూర్తి ముందు కొనసాగాలన్నారు.