నా 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటన చూడలే

నా 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటన చూడలే

జీహెచ్ఎంసీ ఆఫీస్ పై బీజేపీ కార్పొరేటర్ల దాడి దుర్మార్గమన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సమస్యలుంటే అధికారులు , మేయర్ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలే తప్పా.. దౌర్జన్యానికి దిగడం ఏంటని ప్రశ్నించారు .  తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటన చూడలేదన్నారు . బీజేపీ కార్పొరేటర్ల దాడిని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు  సమర్ధించడం దారుణమన్నారు.  కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు బాధ్యతతో మెలగాలన్నారు మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే బాగుండదన్నారు. ఆఫీసులపై దాడులు చేస్తామంటే కుదరదని , ప్రభుత్వం చూస్తు ఊరుకోదని హెచ్చరించారు.