పంచాయతీ కార్యదర్శి పట్టించుకుంటలేరు

పంచాయతీ కార్యదర్శి పట్టించుకుంటలేరు

మెదక్/శివ్వంపేట, వెలుగు: తాగునీటి సమస్యను నిరసిస్తూ మహిళలు ఖాళీ బిందెలతో ఎమ్మెల్యే కాన్వాయ్ ను అడ్డుకున్నారు. మెదక్​జిల్లా శివ్వంపేట మండలం గుండ్లపల్లి ఆసరా పెన్షన్ లు, బతుకమ్మ చీరలు పంపిణీ చేసేందుకు శుక్రవారం నర్సాపూర్​ ఎమ్మెల్యే మదన్ రెడ్డి వెళ్లారు. గ్రామానికి చెందిన మహిళలు ఖాళీ బిందెలతో వచ్చి ఎమ్మెల్యే కాన్వాయ్​ను అడ్డుకుని నిరసన తెలిపారు. ఏడాది నుంచి తాగడానికి మంచినీళ్లు రాక ఇబ్బంది పడుతున్నా పంచాయతీ కార్యదర్శి పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్పీటీసీ మహేశ్​గుప్తా స్పందించి తన సొంత నిధులతో బోరు వేయిస్తానని వారికి హమీ ఇచ్చారు.

దొంతి గ్రామంలో ఆసరా పెన్షన్, బతుకమ్మ చీరలు పంపిణీ చేయడానికి వెళ్లిన ఎమ్మెల్యే మదన్ రెడ్డి ముందు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇస్తలేరంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కొంతన్ పల్లిలో దళితుల భూముల సమస్యలు పరిష్కరించడం లేదని, ఆ విషయం అడిగితే కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే డబుల్​బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని కోరారు.