చెన్నై: కరోనా హాట్స్పాట్గా ఉన్న చెన్నై సిటీని తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు యూనివర్సల్ యాక్టర్, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ ప్రెసిడెంట్ కమల్ హాసన్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ‘నామే తీర్వు’ అనే ప్రజా ఉద్యమాన్ని కమల్ శుక్రవారం ప్రారంభించారు. లాక్డౌన్ తర్వాత ప్రజలు తమ ఇళ్లలో నుంచి బయటకు వెళ్లినప్పుడు వారి హెల్త్ ఇష్యూస్ కు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవడం.. తద్వారా చెన్నైని కరోనా ఫ్రీ సేఫ్ జోన్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కమల్ ఈ మూమెంట్ ముందుకు తీసుకెళ్తనున్నారు. ఈ ప్రోగ్రామ్లో కమల్ తనను తాను మొదటి మెంబర్గా నమోదు చేసుకున్నారు. ఇది చాలా మంది కలలను సాకారం చేసిన చెన్నై సిటీని మళ్లీ మామూలు స్థితికి తీసుకెళ్తుందని ఆశిస్తున్నట్లు విశ్వనటుడు తెలిపారు.
‘మీ భాగస్వామ్యంతోపాటు ప్రజల సహకారంతో ఏ సమస్యకైనా సులువైన పరిష్కారాన్ని కనిపెట్టొచ్చు. ఇది అలాంటి ఆలోచనలను అమలులోకి తెస్తోంది. ప్రజా సమస్యలకు పరిష్కారాలను కనుగొనే స్వచ్ఛంద సేవకుల సైన్యాన్ని మేం సృష్టిస్తున్నాం’ అని విలేకరులతో నిర్వహించిన వర్చువల్ మీటింగ్లో కమల్ హాసన్ చెప్పారు. ఈ ఇనీషియేటివ్లో జాయిన్ అవ్వడానికి 25 నుంచి 30 మంది డాక్టర్స్ ఉత్సుకతతో ఉన్నారని పేర్కొన్నారు. ఎన్జీవోలతోపాటు మరింత మంది లైక్ మైండెడ్ పర్సన్స్ ఈ ఉద్యమంలో చేరాలని కోరారు. వారికి అవసరమైన వైద్య సాయం, సేఫ్టీ ఎక్విప్మెంట్, శానిటైజర్స్, ఫుడ్, రేషన్ అందిస్తామన్నారు. ప్రజలు అధిక సంఖ్యలో గుమిగూడే చోట శానిటైజర్ డిస్పెన్సర్స్ను, ప్రజలకు మాస్క్లను వాలంటీర్స్ పంపిణీ చేస్తారన్నారు. తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27,256గా ఉండగా.. చెన్నైలో వైరస్ ఇన్ఫెక్షన్స్ 18,693గా నమోదైంది.