దొంగ పాస్ పోర్టుల వ్యవహారంపై 10 రోజుల్లో ఉద్యమం

దొంగ పాస్ పోర్టుల వ్యవహారంపై 10 రోజుల్లో ఉద్యమం

రాబోయే రోజుల్లో రాష్ట్రంతో పాటు యావత్ భారత్ దేశం హిందూ దేశంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఎంపీ ధర్మపురి అర్వింద్. నిజామాబాద్ జిల్లా ఆదర్శ్ నగర్ లో చత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు అర్వింద్. ఆ తర్వాత మాట్లాడిన ఆయన…సీఎం కేసీఆర్ కు బానిసలై తొత్తులుగా వ్యవహారిస్తున్ననాయకులు కళ్లు తెరవాలని సూచించారు.దొంగ పాస్ పోర్టుల వ్యవహారంపై.. పోలీస్ కమిషనర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రోహింగ్యాలకు పాస్ పోర్టుల జారీపై కేంద్ర హోమంత్రికి లేఖ రాశామని తెలిపారు. ఎన్ఐఏ ద్వారా విచారణ జరిపిస్తామన్నారు. హిందువులకు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేసే అధికారులు ఇబ్బందులు పడటం ఖాయమన్నారు. పాస్ పోర్టుల అంశంపై.. నిజామాబాద్ నుంచి 10 రోజుల్లో ఉద్యమం చేస్తామన్న అర్వింద్…స్వచ్చందంగా ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.