సరైన పేపర్లు ఉంటేనే గోవుల తరలింపు

సరైన పేపర్లు ఉంటేనే గోవుల తరలింపు

గోవుల తరలింపుపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు నిచ్చింది. సరైన డాక్యుమెంట్స్ లేకుండా గోవులను హైదరాబాద్ సిటీలోకి తరలించేందుకు అనుమతి లేదని కోర్టు తేల్చి చెప్పింది. పోలీసులతో పాటు గోరక్ష దళ్‌కు చెందిన ఒక వ్యక్తి చెక్ పోస్ట్ దగ్గర వాహనాలను తనిఖీ చేసేందుకు అనుమతి ఇచ్చింది. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేయవచ్చని తెలిపింది. గోవుల తరలింపుపై పోలీసులకు గో రక్షకులు సమాచారం ఇవ్వాలంది. గోరక్షకుల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే గోవులను అక్రమంగా తరలిస్తున్న వారిపై విచారించి కేసులు నమోదు చేయాలని తీర్పులో తెలిపింది.