హైదరాబాద్కు మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడెక్కడంటే.?

హైదరాబాద్కు మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడెక్కడంటే.?

లోక్ సభ ఎన్నికలకు పార్టీలు ప్రచారాన్ని స్పీడప్ చేశాయి. ఈ క్రమంలోనే  జాతీయ పార్టీల నేతలు తెలంగాణలో ప్రచారం చేయడానికి క్యూ కట్టారు. ప్రధాని మోదీ ఇవాళ(మే 7న) హైదరాబాద్ కు రానున్నారు.ఈ క్రమంలో  బేగంపేట్ నుంచి రాజ్ భవన్ మార్గంలో మే 7న రాత్రి , మే 8న ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. 

మే 7 రాత్రి 7.50 నిమిషాలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకుని.. అక్కడి నుంచి రాజ్ భవన్ కు వెళ్తారు మోదీ. రాత్రి 7.50 గంటల నుంచి 8.25 గంటల వరకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, మోనప్ప ఐలాండ్, రాజ్ భవన్ వరకు వాహనాలను అనుమతించరు. మే 8న  ఉదయం రాజ్ భవన్ నుంచి తిరిగి బేగంపేట్ ఎయిర్ పోర్ట్ కి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా  రేపు ఉదయం 8.35 నుంచి 9.10 వరకు రాజ్ భవన్, మోనప్ప ఐలాండ్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేట్ ఎయిర్ పోర్ట్ వరకు వెహికిల్స్ ను అనుమతించరు.  ఈ సమయాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వెహికలర్స్ కి సూచించారు ట్రాపిక్ పోలీసులు.