హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ

హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ

తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ  హైదరాబాద్ లోని  బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు.  అక్కడినుంచి నేరుగా రాజ్‌భవన్‌ వెళ్లారు. ఇవాళ రాత్రి రాజ్‌భవన్‌లోనే బస చేయనున్న మోదీ.. రేపు (బుధవారం) ఉదయం వేములవాడకు వెళ్లనున్నారు.  ఉదయం 8 గంటలకు వేములవాడ ఆలయంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని ఆయన దర్శించుకోనున్నారు.  అనంతరం  పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కి మద్దతుగా  పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ పాల్గొననున్నారు. 

మోదీ పర్యటనలో భాగంగా ఇప్పటికే రాజన్న గుడి చెరువు మైదానంలో మూడు హెలిప్యాడ్ లు సిద్ధం చేశారు అధికారులు. కేంద్ర బలగాలు, జిల్లా పోలీసుల కంట్రోల్ లోకి  పట్టణంలోని చాలా ప్రాంతాలు వెళ్లిపోయాయి. పలు చోట్ల ఆంక్షలు విధించారు.  మీడియాకి కూడ చాలా ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. 1200 మంది పోలీసులతో మోదీ టూర్ కోసం భద్రత చేపట్టారు పోలీసులు. రేపటి వరకు పట్టణంలో డ్రోన్స్ ఉపయోగించరాదని పోలీసులు ఆంక్షలు విధించారు.  ఈ సభ అనంతరం మోదీ  వరంగల్ కు చేరుకుంటారు.