ఆర్మూర్ లో ఉద్రిక్తత.. రోడ్డుపై బైఠాయించిన ఎంపీ అర్వింద్

ఆర్మూర్ లో ఉద్రిక్తత.. రోడ్డుపై బైఠాయించిన ఎంపీ అర్వింద్

నిజామాబాద్ లోని   ఆర్ముర్ లో ఎంపీ అర్వింద్ పర్యటన ఉద్రిక్తంగా మారింది. నందిపేట్ పర్యటనకు వెళ్లిన ఎంపీ అర్వింద్ ను  గొడవలు జరిగే అవకాశం ఉందని మధ్యలోనే అడ్డుకున్నారు పోలీసులు.. దీంతో నిరసనగా మామిడిపల్లి చౌరస్తాలో రోడ్డుపై  బైఠాయించారు అర్వింద్ .. అర్వింద్ కాన్వాయ్ ను అడ్డుకునేందుకు ఆలూర్ బైపాస్ సమీపంలో టీఆర్ఎస్ కార్యకర్తలు ట్రాక్టర్ టైర్ లు అడ్డం పెట్టారు. దీంతో భారీగా మోహరించారు పోలీసులు.

ఈ సందర్భంగా మాట్లాడిన అర్వింద్..  తన నియోజక వర్గంలో ఎక్కడైనా పర్యటిస్తానన్నారు. తనతో పాటు బీజేపీ కార్యకర్తలను హత్య చేసేందుకు టిఆర్ఎస్ కుట్ర చేసిందన్నారు. రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లు పెట్టి రాడ్లు కత్తులతో సిద్ధమయ్యారన్నారు. 200మంది టిఆర్ఎస్ కార్యకర్తలు రోడ్లపైకి వస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారన్నారు. పోలీసులు అమ్ముడు పోయి.. గులాబీ రౌడీలకు మద్దతిస్తున్నారన్నారు. పోలీసుల తీరుపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానన్నారు.