హత్య కేసు: నిందితుడి ఇల్లు కాలబెట్టారు

హత్య కేసు: నిందితుడి ఇల్లు కాలబెట్టారు

యాదాద్రి: హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఇంటిని కాలబెట్టారు గ్రామస్థులు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మడలం గొలనుకొండలో సోమవారం రాత్రి కన్ రెడ్డి వెంకటరెడ్డి అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ హత్యలో  దానబోయిన పరుశరాములు అనే వ్యక్తి నిందితుడిగా ఉన్నాడు. అయితే వెంకటరెడ్డి హత్యతో కోపానికి గురైన గ్రామస్థులు ఈరోజు పరుశరాములు ఇంటిని కాలబెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు గొలనుకొండ చేరుకుని పరిస్థితిని అదుపుచేశారు. గ్రామంలో బందోబస్త్ ఏర్పాటు చేశారు.

నిన్న మధ్యాహ్నం టూవీలర్ పై వెంకట్ రెడ్డి తన భార్యతో కలిసి  జనగామకు వెళ్లి వస్తుండగా.. సిరిపురం-గొలనుకొండ రహదారిలో హత్యకు గురయ్యాడు. మాటు వేసిన దుండగులు.. కత్తులతో పొడవడంతో వెంకట్ రెడ్డి అక్కడికక్కడే చనిపోగా.. అతని భార్యకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె హాస్పిటల్ లో చికిత్సపొందుతుంది వీరికి ఇద్దరు ఆడ బిడ్డలు.