తన ఫేస్బుక్ ఖాతా హ్యాక్ అయిందంటూ ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ప్రమేయం లేకుండా తన ఫేస్ బుక్ పేజ్లో పోస్టులు అప్లోడ్ అవడంతో అకౌంట్ హ్యాక్ అయినట్లు గ్రహించిన నైనా జైస్వాల్ పోలీసులను ఆశ్రయించారు.
హ్యాక్ చేసిన వారు పాస్వర్డ్ మార్చేసి కొన్ని వీడియోలను అప్లోడ్ చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐయమ్ నైనా జైస్వాల్ పేరుతో ఫేస్ బుక్ అకౌంట్ ను కొనసాగిస్తున్నట్టు… అందులో 2 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నట్టు ఆమె ఏసీపీ కేవీఎం ప్రసాద్ కు తెలిపారు. సెలబ్రెటీల అకౌంట్ లను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తారని… తిరిగి వారి అకౌంట్ వారికి అప్పగించేందుకు డబ్బులు డిమాండ్ చేస్తుంటారని ఏసీపీ అన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.