
వరంగల్ రూరల్, వెలుగు: జీడబ్ల్ యూఎంసీ ఆధ్వర్యంలో సిటీలో ఏర్పాటు చేసిన సైకిల్ ట్రాక్ బాగుందంటూ మున్సిపల్ మంత్రి కేటీ ఆర్ శనివారం ఉదయం ట్విట్టర్ లో చేసిన పోస్ట్ వైరల్ అయింది. ‘మస్త్ ఉన్నది.. గ్రేట్ సార్’ అని కొందరు.. ‘జీడబ్ల్ యూఎంసీ ఎలక్షన్ స్టంట్’ అని మరొకొందరు కామెంట్ చేశారు. వావ్ వరంగల్.. ఎక్సలెంట్ వీడియో అని కొందరు చెప్పగా.. మెగా టెక్స్టైల్ పార్క్ వీడియో ఎప్పుడు పెడతారని ఇంకొందరు రిప్లైలు ఇచ్చారు. అలాగే సైకిల్ ట్రాక్ ల నిర్వహణపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేసి రీ పోస్టులు పెట్టారు. కేటీఆర్ పోస్టుపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ.. స్మార్ట్ సిటీ ఫండ్స్ రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ చేసినా కేంద్రం సిటీ అభివృద్ధికి సహకరిస్తుందన్నారు. మొదట ప్రధాని మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ థ్యాంక్స్ చెప్పాలన్నారు. వీడియోలు పెట్టడం కంటే పెండింగ్ పనులను కంప్లీట్ చేయాలన్నారు. కేంద్రం రైల్వే స్టేషన్లను అందంగా తీర్చిదిద్దితే.. రాష్ట్ర ప్రభుత్వం బస్టాండ్లను భ్రష్టు పట్టించిందన్నారు.