జగిత్యాలలో నూతన జంటపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి

జగిత్యాలలో నూతన జంటపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి

జగిత్యాల జిల్లాలో నూతన జంటపై కొందరు దుండగులు దాడికి ప్రయత్నం చేశారు. జగిత్యాల రూరల్ మండలం తిప్పన్నపేట గ్రామానికి చెందిన  ఉమ, చంద్రశేఖర్ ఇద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న కొత్త జంటపై..  AP 29 AK 2838 నంబర్ గల కారులో వచ్చిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు  దాడికి ప్రయత్నించారు. అయితే వారి నుంచి తప్పించుకున్న జంట  జగిత్యాల రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కేసు నమోదు చేశారా, లేదా.. దుండగులపై చర్యలుంటాయా లేదా చెప్పడంలేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. తన తల్లే తమపై  దాడికి యత్నించిందని ఉమ ఆరోపిస్తోంది.  ఇప్పటికే మూడుసార్లు తమపై దాడికి యత్నించారని.. పెళ్లైన రోజు ఇంటిపైకి కూడా దాడికి వచ్చినట్టు ఆమె చెబుతోంది.