రాష్ట్రంలో కొత్తగా 1,267 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 1,267 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,267 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 2,52,455 కేసులు నమోదయ్యాయి. తాజాగా సోమవారం కరోనా బారినపడి నలుగురు చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1,385కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 1,831 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 2,32,489గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 18,581 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా.. మరో 15,794 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. సోమవారం 42,490 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 46,84,766 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.54 శాతంగా మరియు రికవరీ రేటు 92.09 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 201, మేడ్చల్ 109, రంగారెడ్డి 104, నల్గొండ 89, భద్రాద్రి 85, ఖమ్మం 62, కరీంనగర్ 53, వరంగల్ అర్బన్ 45, సూర్యపేట్ 42, నిజామాబాద్ 40 కేసులు నమోదైనట్లు రోగ్యశాఖ తెలిపింది.

For More News..

మొదలైన దుబ్బాక కౌంటింగ్..

జడ్పీటీసీ వేధిస్తున్నడని సూసైడ్ అటెంప్ట్

మాట వింటలేడని కలెక్టర్​‌ను ట్రాన్స్‌ఫర్ చేయించిన్రు