రాష్ట్రంలో కొత్తగా 1,445 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 1,445 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,445 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 2,38,632 కేసులు నమోదయ్యాయి. తాజాగా శుక్రవారం కరోనా బారినపడి ఆరుగురు చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1,336కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 1,486 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 2,18,887గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 18,409 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా.. 15,439 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. శుక్రవారం 41,243 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 42,81,991 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.56 శాతంగా మరియు రికవరీ రేటు 91.72 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 286, మేడ్చల్ 122, రంగారెడ్డి 107, నల్గొండ 102, భద్రాద్రి 90, ఖమ్మం 77, కరీంనగర్ 65, వరంగల్ అర్బన్ 53, సిద్ధిపేట్ 43, జగిత్యాల్ 35 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

టీ20ల్లో వెయ్యి సిక్సర్లు కొట్టిన ఫస్ట్‌‌ క్రికెటర్

మహిళల భద్రతకు ‘ మేరీ సహేలి’

స్కూల్ బస్సు, ట్రక్కు ఢీ 21 మంది మృతి