తెలంగాణలో కొత్తగా 1,536 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 1,536 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,536 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 2,42,506 కేసులు నమోదయ్యాయి. తాజాగా సోమవారం కరోనా బారినపడి ముగ్గురు చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1,351కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 1,421 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 2,23,413గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 17,742 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా.. మరో 14,915 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. సోమవారం 45,021 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 43,94,330 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.55 శాతంగా మరియు రికవరీ రేటు 92.12 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 281, భద్రాద్రి 123, ఖమ్మం 97, మేడ్చల్ 96, రంగారెడ్డి 92, నల్గొండ 81, కరీంనగర్ 76, వరంగల్ అర్బన్ 49, సూర్యపేట్ 47, కామారెడ్డి 38, మంచిర్యాల్ 37, జగిత్యాల్ 37, యాదాద్రి 34, రాజన్న సిరిసిల్ల 33, నాగర్ కర్నూల్ 32, నిజామాబాద్ 32, పెద్దపల్లి 31, యాదాద్రి 31, సిద్ధిపేట్ 30 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

చైనా వస్తువులు మనకొద్దు

ఆరేండ్లాయినా ఉద్యోగం రాకపాయె!

‘బాబ్రీ తీర్పు చెప్పిన జడ్జికి నో సెక్యూరిటీ’