తెలంగాణలో కొత్తగా 1,602 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 1,602 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,602 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 2,47,284 కేసులు నమోదయ్యాయి. తాజాగా గురువారం కరోనా బారినపడి నలుగురు చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1,366కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 982 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 2,26,646గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 19,272 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా.. మరో 16,522 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. గురువారం 46,970 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 45,31,153 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.55 శాతంగా మరియు రికవరీ రేటు 91.65 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 295, మేడ్చల్ 137, రంగారెడ్డి 118, భద్రాద్రి 77, ఖమ్మం 79, నల్గొండ 79, కరీంనగర్ 76, వరంగల్ అర్బన్ 49, నాగర్ కర్నూల్ 47, పెద్దపల్లి 46, సూర్యపేట్ 45, ములుగు 43, సంగారెడ్డి 40, మంచిర్యాల్ 39, జగిత్యాల్ 39, సిద్ధిపేట్ 38, కామారెడ్డి 36, నిజామాబాద్ 33, రాజన్న సిరిసిల్ల 33, యాదాద్రి 33, మహబూబ్ నగర్ 32, ములుగు 32 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

రోడ్లెక్కిన సపోర్టర్స్​.. ఇండ్లపైకి రాళ్లు విసిరి.. వాహనాలకు నిప్పు పెట్టిన నిరసనకారులు

7 కోట్ల ఓట్లతో బైడెన్ రికార్డ్

1992 నుంచి రీఎలక్షన్‌లో ఎవరూ ఓడిపోలే