తెలంగాణలో మరో 873 కరోనా కేసులు

తెలంగాణలో మరో 873 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 873 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 2,63,526 కేసులు నమోదయ్యాయి. తాజాగా శనివారం కరోనా బారినపడి నలుగురు చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1,430కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 1,296 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 2,50,453గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,643 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా.. మరో 9,345 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. శనివారం 41,646 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 51,34,335 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.54 శాతంగా మరియు రికవరీ రేటు 94.03 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 152, మేడ్చల్ 78, రంగారెడ్డి 71, భద్రాది 58, వరంగల్ అర్బన్ 56, నల్గొండ 47, కరీంనగర్ 44, జగిత్యాల 36 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

అన్నీ పిరమే! క్యాండిడేట్లకు భారంగా మారిన ఎన్నికలు

ప్రచారానికి పోతే రూ.1000, బిర్యానీ ప్యాకెట్

కరోనా మరణాల కట్టడికి కొత్త ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌కు కనుగొన్న తెలంగాణ సైంటిస్ట్