రాష్ట్రంలో కొత్తగా మరో 925 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా మరో 925 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 925 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 2,62,653 కేసులు నమోదయ్యాయి. తాజాగా శుక్రవారం కరోనా బారినపడి ముగ్గురు చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1,426కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 1,367 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 2,49,157గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 12,070 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా.. మరో 9,741 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. శుక్రవారం 42,077 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 50,92,689 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.54 శాతంగా మరియు రికవరీ రేటు 94.86 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 161, మేడ్చల్ 91, రంగారెడ్డి 75, కరీంనగర్ 52, నల్గొండ 46, వరంగల్ అర్బన్ 46, భద్రాది 43, ఖమ్మం 42, జగిత్యాల 39 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

బ్యాంకింగ్‌‌లోకి బడా కార్పొరేట్లు

ఫోన్ వాడొద్దన్నందుకు.. ఉరి వేసుకుంది

టీఆర్ఎస్‌లో రెబల్స్ లొల్లి